ఇదేనిజం, లక్షెట్టిపేట: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముసురు వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయి చెరువును తలపిస్తున్నాయి. వర్షపాతంతో రైతులు వర్షాలు కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.