Homeజిల్లా వార్తలుమియాపూర్ లో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్..!

మియాపూర్ లో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్..!

ఇదేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా పట్టుబడింది. విశ్వసనీయ  సమాచారం మేరకు బుధవారం ఉదయం  మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డు లో  మియాపూర్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈ క్రమంలో  మహీంద్రా కారులో  21 కిలోల గంజాయిని ఒరిస్సా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకున్నారు . ముగ్గురు నిందితులు అందులో ఒరిసాకు చెందిన ఇద్దరు, హైదరాబాదుకు చెందిన ఒకరిని గుర్తించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img