ఇదేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డు లో మియాపూర్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహీంద్రా కారులో 21 కిలోల గంజాయిని ఒరిస్సా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకున్నారు . ముగ్గురు నిందితులు అందులో ఒరిసాకు చెందిన ఇద్దరు, హైదరాబాదుకు చెందిన ఒకరిని గుర్తించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.