గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘RC16’ ( వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ రేపటి (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు చరణ్ నేడు మైసూర్కి పయనం అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.