Homeఫ్లాష్ ఫ్లాష్ఆన్​లైనా.. ఆఫ్​లైనా ఏదో ఒకటి తేల్చండి: హైకోర్టు

ఆన్​లైనా.. ఆఫ్​లైనా ఏదో ఒకటి తేల్చండి: హైకోర్టు

హైదరాబాద్​: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోంద‌ని ప్రభుత్వంపై రాష్ట్ర హై కోర్టు మండిపడింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై తెలంగాణ ప్ర‌భుత్వానికి క్లారిటీ లేద‌ని హైకోర్ట్ అభిప్రాయం వ్య‌క్తం చేసింది. డిగ్రీ, పీజీ ఫైనల్​ సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఎన్ఎస్ యూఐ ,ఇతర పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హై కోర్టులో విచారణ జరిగింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఎదో ఒకే విధానం ఉండేలా స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పించ్చింది.
సంప్లిమెంట్​ రాసినా రెగ్యులర్​గా గుర్తిస్తం
ఆన్ లైన్ లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాద‌ని, గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య ఉన్నట్లు ప్రభుత్వం కొర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇదే సమయలో పరీక్షలు రాయలేని వారు సప్లిమెంటరీ రాయవచ్చని, సప్లిమెంటరీ లో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్ గా పరిగణిస్తామ‌ని కోర్టుకు తెలిపింది. అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్ లైన్ లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామ‌ని ఓయూ అధికారులు చెప్పగా.. మిడ్ టర్మ్ పరీక్షలు ఆన్ లైన్ లో.. సెమిస్టర్ ఆఫ్​లైన్​లో నిర్వహిస్తామ‌ని జేఎన్​టీయూహెచ్​ అధికారులు కోర్టుకు తెలియజేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img