Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్..!

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్..!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాకిచ్చింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని అభిప్రాయపడింది. ఈ నెల 24న వాదనలు వింటామని డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.

Recent

- Advertisment -spot_img