భారత్, ఆసీస్ మధ్య ఎన్ని సిరీస్లు జరిగినా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకతే వేరు. 1996లో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇరుజట్లకు విశేష సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, అలెన్ బోర్డర్ గౌరవార్థం ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని ఇరుదేశాల బోర్డులు నిర్ణయించాయి. దీంతో ఈ సిరీస్కు ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’కి నామకరణం చేశారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. టీమిండియా టార్గెట్ అదే!
భారత్, ఆసీస్ మధ్య ఎన్ని సిరీస్లు జరిగినా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకతే వేరు. ఇప్పటివరకు ఈ సిరీస్ను 16సార్లు నిర్వహించగా.. భారత్ 10సార్లు విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఐదుసార్లు విజయం సాధించగా.. ఒకసారి (2003/04) డ్రా అయింది. టీమ్ఇండియా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించింది. త్వరలో ప్రారంభంకానున్న సిరీస్లో ఆసీస్ను కంగుతినిపించి హ్యాట్రిక్ కొట్టాలని టీమ్ఇండియా తహతహలాడుతోంది.