చలి తీవ్రత నానాటికీ పెరుగుతుండటంతో గ్రేటర్లో వంటగ్యాస్ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. విద్యుత్ గీజర్లు, హీటర్ల వినియోగంతో కరెంటు బిల్లుల మోతతో బెంబేలెత్తిపోతున్న సామాన్యులు గ్యాస్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 40లక్షలకు పైగా గ్యాస్ వినియోగదారులుండగా.. సాధారణ రోజుల్లో రోజూ 90వేల రీఫిల్ సిలిండర్లు బుక్ అయ్యేవి. చలి తీవ్రతతో ఈ సంఖ్య లక్షకు చేరింది.