Homeక్రైంఛత్తీస్​గఢ్​లో భారీ పేలుడు

ఛత్తీస్​గఢ్​లో భారీ పేలుడు

– పోలీసులే లక్ష్యంగా మందుపాతర
– పలువురికి గాయాలు

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: ఛత్తీస్​గఢ్​లో శనివారం భారీ పేలుడు సంభవించింది. పోలీసులే లక్ష్యంగా ఈ పేలుడుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు.
బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు దంతెవాడ పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒకరోజు ముందు ఈ ఘటన జరగడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img