Homeతెలంగాణటూరిజం శాఖలో వందల కోట్ల అవినీతి

టూరిజం శాఖలో వందల కోట్ల అవినీతి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణలు

ఇదే నిజం, హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదు’అని నారాయణ వ్యాఖ్యానించారు. సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ఊపిరాడని నిర్బంధాలు జరిగాయి. బంగారు తెలంగాణను చేస్తానన్న కేసీఆర్‌.. ఒక్క హామీ అమలు చేయలేదు. నిర్బంధాలను సహించబోమని తెలంగాణ ప్రజానీకం స్పష్టమైన తీర్పునిచ్చింది. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు బాగా కలిసొచ్చింది. టీడీపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐతో పొత్తు కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు విశ్వసించారు. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేం చేస్తారనే కేసీఆర్‌ను ఓడించారు’అని కూనంనేని అన్నారు.

Recent

- Advertisment -spot_img