Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ వేలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ మెట్రో తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ‘మీటైమ్ ఆన్ మై మెట్రో’ అనే ప్రచార కార్యక్రమంలో పేరుతో జరిగిన ప్రమోషనల్ క్యాంపెయిన్లో ఆయన మాట్లాడుతూ 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని తెలిపారు.