దేశంలో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఆసియాటిక్ సింహాలు, రాయల్ బెంగాల్ టైగర్లు, తెల్ల పులులు, ఒక కొమ్ము ఖడ్గమృగం వంటి అంతరించిపోతున్న జాతుల విజయవంతమైన సంతానోత్పత్తి కార్యక్రమాలకు జూ పార్క్ పేరు గాంచింది. అలాగే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, మొబైల్ యాప్, సోషల్ మీడియాలో యాక్టివ్ ఎంగేజ్మెంట్ వంటి ఆధునిక సాంకేతికతలను నెహ్రూ జూలాజికల్ పార్క్ అవలంబించిందని జూ పార్కు డైరెక్టర్ (ఎఫ్ఎసి) డాక్టర్ హిరేమత్ చెప్పారు. అందుకే జూ పార్క్ కు 3వ ర్యాంక్ వచ్చిందని చెప్పారు.