ఇదే నిజం : ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కొంతమంది సంఘ డైరెక్టర్ల అవిశ్వాసం పెట్టగా అవిశ్వాసం వీగిందని. సంగం సంబంధించిన పనుల్లో లావాదేవీలు ఇలాంటి అవినీతికి పాల్పడలేదని సంఘ అభివృద్ధికి పనిచేశానని అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్రెడ్డి మాట్లాడుతూ… నాపై సంఘ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అవిశ్వాసం విగిందని ముస్తాబాద్ సింగిల్ విండో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘముగా తీర్చిదిద్దుతూ పేరుగాంచిన సంఘంను కొంతమంది వ్యక్తులు సంఘాన్ని అపరిష్ట పాలు చేయడానికి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు డైరెక్టర్లు తప్పు దోవ పట్టిస్తున్నారు. సింగిల్ విండో లావాదేవీలు పారదర్శకంగా ఏ పనైనా ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది ఆన్లైన్లో నమోదు చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారమే ఖర్చు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆడిట్ రిపోర్ట్ పరిశీలించి బాగుండదని అన్నారు. ప్రతి లాభాదేవిని ఆడిట్ ద్వారా ఆరు నెలలు సంవత్సరంకు రిపోర్ట్ చేస్తున్నట్లు ఎలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడలేదని ప్రతి డైరెక్టర్ కు సముచిత గౌరవం ఇచ్చి వారికి సమాచారం అందిస్తూ తీర్మానం మేరకు సంగం పనులు చేపట్టడం జరిగిందని.. ఒక నిరుద్యోగ పేద యువతికి సొసైటీలో ఉద్యోగం కల్పించడానికి అందరి అనుమతి తీసుకోవడంజరిగిందని ముస్తాబాద్ మండలంలోని పేరు ఉన్న నాయకుడిగా ఉన్న నన్ను అభస్తపాలు చేయడానికి నాపై కావాలని అవిశ్వాసం పెట్టారని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధి కోసం మద్దికుంట రోడ్డులో విలువైన స్థలాన్ని కొనుగోలు చేశామని తోటి డైరెక్టర్లు ఆడిట్ రిపోర్ట్ చూపెట్టడం లేదని అసత్య ప్రచారం నాకు సంబంధించిన వారికి క్రాప్ లోన్లు అందిస్తున్నట్లు నాపై అభియోగాలు చేస్తూ సంఘం సంబంధించిన ఏ పనిలో కూడా అవినీతికి పాల్పడలేదని. సంగం డబ్బులు కొంతమంది డైరెక్టర్ పర్సనల్గా ఇవ్వండి అని నాపై ఒత్తిడి చేస్తే నేను వ్యతిరేకిస్తే నాపై అవిశ్వాస తీర్మానం పెట్టారు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు నిజాయితీగా అవినీతి నిరూపించాలంటే ఏ ఒక్క అవినీతి నిరూపించిన ఏ శిక్ష కైనా నేను సిద్ధంగా ఉన్నాను కుటుంబం గానీ నేను మచ్చలేని నాయకుడిగా రెండోసారి సింగిల్ విండో చైర్మన్ గా చేస్తున్నాను నాపై ఇలాంటి అభియోగాలు లేవని నన్ను బదనం చేయడానికి కొంతమంది డైరెక్టర్ లకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నాపై అవిశ్వాసం పెట్టారని ప్రజల కాంగ్రెస్ పార్టీ దయవల్ల అవిశ్వాసం విగిందని అన్నారు. నాపై అభియోగం నిరూపిస్తే ఈ శిక్ష కైనా సిద్ధమేనని సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. సమావేశంలో డైరెక్టర్ కరెట్ల కొండల్ రెడ్డి ఎల్ల గిరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.