గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను టైటిల్కు నడిపించినప్పటికీ, జట్టులో తనకు తగిన గుర్తింపు లభించలేదని పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి పనిచేసినా, మన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని ఆయన అన్నారు. ‘భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డా. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా నిలిచారు. నన్ను నిరూపించుకునేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యా’ అని శ్రేయాస్ తెలిపారు.