Homeసినిమావాటిని అస్సలు పట్టించుకోను...

వాటిని అస్సలు పట్టించుకోను…

సినిమా హీరో, హీరోయిన్లు అంటేనే సోషల్​ మీడియాలో కామెంట్లు సర్వ సాదారణం. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రతి యాక్టర్​పై ఏదో ఒక కామెంట్​తో పాటు పుకార్లు పుడుతూనే ఉంటాయి. ఇక ఇలాంటి వాటిని కొంత మంది నటులు పర్సనల్​గా తీసుకుని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారికి సోషల్​మీడియాలోనే ఘాటైన సమాదానం ఇవ్వడం జరుగుతుంది. అయితే కొందరు ఈ కామెంట్లను పట్టించుకోరు. అలాంటి వారిలోనే తానూ ఉంటానంటుంది జాన్వీ కపూర్​ తనపై వచ్చే కామెంట్లు, పుకార్లను అస్సలు పట్టించుకోను అంటుంది జాన్వీ. శ్రీదేవి, బోనీ కపూర్​ల సినీ వారసురాలిగా మరాఠీ చిత్రం సైరాట్​ సినిమాకు హిందీ రిమేక్​గా వచ్చిన దడఖ్​ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం గుంజన్​ సక్సేనా ది కార్గిల్​ గర్ల్​ సినమాతో ప్రేక్షకులముందుకు వచ్చంది. మరో మూడు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img