Homeహైదరాబాద్latest Newsనాలో ఉన్నది నాన్న రక్తమే

నాలో ఉన్నది నాన్న రక్తమే

– వైఎస్​ పాలన ఓ మార్క్​
– నన్ను తిట్టేందుకు జోకర్లు వస్తున్నారు
– సాక్షిలో నాకు వాటా ఉంది
– ఆంధ్రరాష్ట్రం నా పుట్టిళ్లు .. అందుకే ఇక్కడికి వచ్చా
– ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల

ఇదేనిజం, ఏపీ బ్యూరో: తనలో ఉన్నది నాన్న వైఎస్సార్​ రక్తమేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పేర్కొన్నారు. తాను ముమ్మాటికి వైఎస్​ షర్మిలా రెడ్డినేనని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం తన పుట్టిళ్లు కాబట్టే ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. సోమవారం కడప జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్​ పాలన అంటే ఓ మార్క్​ అని పేర్కొన్నారు. సాక్షి మీడియా సంస్థలో తన వాటా ఉందని చెప్పారు. ఎవరెన్ని నిందలు వేసినా తాను వైఎస్​ షర్మిలా రెడ్డినేనన్నారు. తనపై నిందలు వేసేవారిపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్​ ఆర్​ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్ తన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించారన్నారు. ఆయన పాలనలో వైఎస్సార్​ పథకం అందని గడప లేదని చెప్పారు. పార్టీలకతీతంగా అందరూ పథకాలు పొందారని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ వైఎస్సార్ మార్క్ అని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్​ కడప స్టీల్​ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. తన మీద సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన నాయకులతో పెయిడ్​ ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img