నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్ సీజన్ 4’. ఈ టాక్ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ తన హోస్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలయ్యతో అన్స్టాపబుల్ షోలో సందడి చేసారు. తాజాగా దీనికి సంబందించిన ప్రోమోని ఆహా టీమ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ల ఫోటోను చూపిస్తూ.. ‘మీరు పార్టీకి వెళ్లాల్సి వస్తే ఈ ముగ్గురిలో ఎవరితో వెళ్తారు?’ అని ప్రశ్నించారు. రామ్ చరణ్ స్పందిస్తూ.. నేను ముగ్గురితో వెళ్లను.. మా మామతో వెళ్తాను.. అదే మామయ్య అల్లు అరవింద్ గారే పార్టీకి బెస్ట్ అని చరణ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. కాగా, ఈ ఎపిసోడ్లో రామ్చరణ్తో పాటు శర్వానంద్ కూడా సందడి చేసారు.