భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్కు అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో నీతూ డేవిడ్కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. ఈ ముగ్గురినీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన నీతూ డేవిడ్ 1995-2008 మధ్య భారత్కు ప్రాతినిధ్యం వహించింది.