Homeహైదరాబాద్latest Newsవారిపై అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం : కేటీఆర్

వారిపై అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం : కేటీఆర్

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది ఈ తీర్పు నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. మొన్నటి రోజు వరకు స్పీకర్ ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదని కోర్టు వాదించిందని కేటీఆర్ విమర్శించారు. అయితే ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు మండిపడ్డారు. హైకోర్టు రీజనబుల్ పీరియడ్ అని చెప్పిందని తెలిపారు. రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు.

Recent

- Advertisment -spot_img