ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిధుల బదిలీకి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చారు. ఈ కేసు నమోదుపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఇ రేసులో కుంభకోణం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా – ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ జరపాలని .. సమాధానం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని కేటీఆర్ తెలిపారు.