Homeహైదరాబాద్latest Newsమీకు పాలన చేతకాక పోతే గద్దె దిగండి, కానీ మా పిల్లల ప్రాణాలు తీయకండి: ఆర్.ఎస్.ప్రవీణ్...

మీకు పాలన చేతకాక పోతే గద్దె దిగండి, కానీ మా పిల్లల ప్రాణాలు తీయకండి: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై 25 రోజులుగా వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడిన గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మృతి చెందడం బాధాకరం. సీఎం గారు, మీకు పాలన చేతకాక పోతే గద్దె దిగండి, కానీ మా పిల్లల ప్రాణాలు తీయకండి అని బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ గారి పాలనలో గురుకులాలు ఒక భూతల స్వర్గం. పిల్లలు అమ్మఒడిలోఉన్నట్టు గా పదిలంగా ఉండేవారు అని తెలిపారు. 24×7 పిల్లల ఆరోగ్యాన్ని డాక్టర్లు కాపాడే వారు. పిల్లలకు నాలుగు పూటలా మంచి తిండి దొరికేది. చలికాలంలో వులెన్ రగ్గులు ఇచ్చేవారు. నాకు గుర్తుకున్నంత వరకు కలుషితమైన ఆహారం తిని ఏ విద్యార్థి కూడా ఏ గురుకులంలో కూడా ఆసుపత్రిలో చనిపోలేదు అని తెలిపారు. నడిగూడెంలో కరెంటు షాకు తో కాలిన గాయాలైన కీర్తన అనే పేద బిడ్డకు రెండు చేతులు తీయాల్సివస్తే జర్మనీ నుండి ₹36 లక్షలతో రెండు కృత్రిమ చేతులను ఆఘమేఘాల మీద దిగుమతి చేసుకొని అమర్చిన గొప్ప మానవతా వాది కేసీఆర్ అని చెప్పారు. మీరేమో అభయహస్తం పేరుతో పిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. మీ చేతుల్లో మా పిల్లల ను పెట్టాలంటే భయమేస్తోంది అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు.

Recent

- Advertisment -spot_img