అరటి పండు, యాపిల్ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండు, యాపిల్లో ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు యాపిల్, అరటి పండును తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్, గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. జీర్ణసమస్యలు తగ్గుతాయి.