- ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఓడినా నష్టం లేదు
- కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా.. ఓడినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ఎలా అమలు చేయాలనే రూట్మ్యాప్ ఇప్పుడు వారి వద్ద లేదన్నారు. ప్రధాని మోడీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు.