నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. సిమ్ కార్డుల జారీలో మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీచేస్తారు. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపులతోపాటు శాటిలైట్ కమ్యూనికేషన్కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.