Homeతెలంగాణబెదిరించి భయపెట్టాలని చూస్తే చెప్పు తెగుద్ది

బెదిరించి భయపెట్టాలని చూస్తే చెప్పు తెగుద్ది

– బీజేపీతో కలిసిపోవడానికి సిగ్గులేదా? అని కొండా ఫైర్​

– బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేనికి కొండా సురేఖ వార్నింగ్

ఇదేనిజం, వరంగల్​ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. నరేందర్ కారులో వెళ్తుండగా ఆపి మరీ ఆయనను హెచ్చరించారు. కాంగ్రెస్​ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీతో కలిసి కుట్ర చేయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం వరంగల్​ పెరుకవాడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తలను కొండా సురేఖ ఆమె కుమార్తె సుస్మిత పటేల్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. నన్నపునేని దగ్గరికెళ్లిన సురేఖ ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రదీప్‌రావు కలిసిపోవడానికి సిగ్గులేదా? నిన్ను ఈ స్థాయికి ఎవరు తీసుకొచ్చారో తెల్వదా?’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేఖతో వాదనకు దిగుతూ చేయిలేపగా, ఆ వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే పనిచేశారు. దీంతో సురేఖ మళ్లీ మాట్లాడుతూ ‘చెప్పు తెగుద్ది. భయపెట్టుడు, బెదిరించుడు చేస్తే ఒళ్లు పికులుద్ది.’అని స్ట్రాంగ్​ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి నన్నపునేని నరేందర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Recent

- Advertisment -spot_img