Homeహైదరాబాద్latest Newsఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్.. ఘన విజయం..!

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్.. ఘన విజయం..!

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 534 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 238 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. కాగా, తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150, ఆసీస్‌ 104.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 487 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆస్ట్రేలియా గడ్డపై 40 ఏళ్ల రికార్డ్‌ను భారత్ బ్రేక్ చేసింది. టెస్టుల్లో పరుగుల పరంగా ఆసీస్ జట్టుపై అతిపెద్ద విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. 1978లో 222 పరుగుల తేడాతో టీమిండియా.. ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు కాగా.. తాజాగా నేడు టీమిండియా ఆసీస్ పై 295 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి కొత్త చరిత్రను లిఖించింది.

Recent

- Advertisment -spot_img