విండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో 6 వికెట్లు, బ్యాటింగ్లో 39* పరుగులతో రాణించింది. ఇక, మూడు వన్టేల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.