India Pakistan War 2025: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితి నేపథ్యంలో రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సరిహద్దు ప్రాంతంలో భద్రతా ఆందోళనలు పెరగడంతో, జైసల్మేర్ రైల్వే స్టేషన్ మీదుగా జరిగే రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నారు. ఏదైనా అపాయకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరారు.