India – Pakistan : జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిపై భారతీయుల రక్తం మరిగిపోతోంది. కశ్మీర్ పర్యాటకులను పాకిస్థాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేసి హతమార్చారు. ఈ దాడిలో 30 మంది చనిపోయారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసే సమయం ఆసన్నమైంది. ఉగ్రదాడికి పాల్పడినవారిని ఎవరిని వదిలిపెట్టం అని మోడీ అన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం అని మోడీ అన్నారు. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. అలాగే పాకిస్తానీయులకు వీసాలు కూడా తక్షణమే రద్దు చేసారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఈ క్రమంలో ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుంది అనే ప్రశ్న నెలకొంది. ఇప్పటికే పాకిస్తాన్ సైనిక అధికారులు భారత సరిహద్దులో పెద్ద సంఖ్యలో సైనికులను మోహరిస్తున్నారు. కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి కి యుద్ధ విమానాలను తరలించింది. భారత్ నుంచి కూడా భద్రతా బలగాలు సరిహద్దు భద్రతపై నిఘా పెంచాయి. ఇవ్వని చూస్తుంటే ఇండియా పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే యుద్ధం జరగబోతుంది.