Homeఅంతర్జాతీయంIndia vs Pakistan: అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్..!

India vs Pakistan: అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్..!

India vs Pakistan: భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు పాకిస్థాన్‌ను కలవరపెడుతున్నాయి. నిన్న ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో భారత్ మిస్సైల్ దాడులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో షెహబాజ్ షరీఫ్‌ను అత్యంత రహస్యంగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పయనమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ కూడా ఈ దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. భారత్ యొక్క ఈ ఆకస్మిక దాడులతో పాకిస్థాన్ రాజకీయ, సైనిక నాయకత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, దేశ రాజధానిలోనే జరిగిన ఈ ఘటన పాక్ ప్రభుత్వాన్ని గజగజా వణికేలా చేసింది.

Recent

- Advertisment -spot_img