Homeజాతీయంసోషల్​ మీడియాలో ఆర్మీపై బద్నాం వార్తలు​.. ఖండించిన కేంద్రం

సోషల్​ మీడియాలో ఆర్మీపై బద్నాం వార్తలు​.. ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ: ‘ఇండియా, చైనా బార్డర్​లో ఉద్రిక్తల నేపథ్యంలో ఇండియన్​ ఆర్మీకి చెందిన సైనికులు సిక్​లీవ్​లకు అప్లై చేసుకుంటున్నారని, పైగా గత 45 ఏండ్లలో తొలిసారిగా 80వేలకు పైగా సైనికులు లీవ్​లకు అప్లై చేశారంటూ’ సోషల్​ మీడియాలో వార్తలు హల్​చల్​ చేస్తున్న వార్త అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్​ ఆర్మీ సైనికుల సిక్​ లీవ్​ వార్తలు అసత్యాలని మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. చైనాతో ఉద్రిక్తతల కారణంగా సైనికులు ఎవరూ లీవ్​కు అప్లై చేయరని సైనిక అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ షేర్​ చేయరాదని భారతీయ భద్రతాదళ అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img