రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోయారని చెప్పారు. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. కాంగ్రెస్ రైతుల పక్షపాత ప్రభుత్వమని, ఇప్పటికే రూ. 18వేల కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.