దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తున్నాం. తొలిదశలో 4.50లక్షల ఇళ్లు నిర్మిస్తాం’’ అని అన్నారు.