Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లిలో భీమా చెక్కు అందజేత

గొల్లపల్లిలో భీమా చెక్కు అందజేత

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది లక్ష్మీరాజ్యం తన పొదుపు ఖాతా ద్వారా కేడీసీసీ బ్యాంకులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రీమియం చెల్లించారు. నామినిగా ఆయన భార్య లక్ష్మిని నమోదు చేశాడు. లక్ష్మీరాజ్యం అనారోగ్యంతో మృతి చెందగా లక్ష్మికి రెండు లక్షల భీమా చెక్కును మేనేజర్ మల్లేశం అందజేశారు. ప్రధానమంత్రి జీవనోజ్యోతి భీమా యోజన అనేది ఏ కారణం చేతనైనా మరణిస్తే జీవిత భీమా రక్షణ కల్పించే భీమా పథకమని, 18 నుంచి 50 ఏళ్లలోపు వారందరూ చేరేందుకు అర్హులని తెలిపారు. ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులైన వారు భీమా పథకమును సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్,నల్ల సతీష్ రెడ్డి,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img