Homeహైదరాబాద్latest NewsIPL-2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్..రిషబ్ పంత్‌పై సస్పెన్షన్‌..!

IPL-2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్..రిషబ్ పంత్‌పై సస్పెన్షన్‌..!

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ నిర్వాహకులు ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఐపీఎల్ లో లీగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నారు. కాబట్టి రిషబ్ పంత్‌ తదుపరి మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడబోయే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్‌ యాజమాన్యం రిషబ్ పంత్‌ పై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. అంతేకాదు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. గత మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్‌ రేట్‌ నమోదు ఇది మూడోసారి. కాబట్టి అతని మ్యాచ్ ఫీజు రూ. 30 లక్షలు కట్ చేసి ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధించారు.

Recent

- Advertisment -spot_img