IPL 2024లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేజ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో చొరబడి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మవైపు దూసుకొచ్చాడు.
ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోహిత్.. ఆతర్వాత ఆ వ్యక్తిని కౌగిలించుకుని గ్రౌండ్లో నుంచి బయటికి వెళ్లాలని సూచించాడు. రోహిత్ను కౌగించుకున్న అనంతరం ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఇషాన్ కిషన్తో సైతం కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తికి పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.