IPL 2025: ఐపీఎల్ మ్యాచ్లు తిరిగి ప్రారంభం: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో మాత్రమే నిర్వహణ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేయబడిన ఐపీఎల్ మ్యాచ్లు వారం రోజుల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ అప్రమత్తంగా ఉంటూ, మిగిలిన మ్యాచ్లను కేవలం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మూడు నగరాల్లో అన్ని మ్యాచ్లను పూర్తి చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నిర్ణయం భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది.