ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రెండు బిగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మద్యాహ్నం గం. 3:30 లకు కోల్కతా వేదికగా కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి గం.7:30లకు ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్, గుజరాత్తో తలపడనుంది. కాగా ఇప్పటివరకూ 7 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.