IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికులకు శుభవార్త అందించారు. కౌంటర్లో కొనుగోలు చేసిన టిక్కెట్లను కూడా ఆన్లైన్లో రద్దు చేసుకోవచ్చని ఆయన అన్నారు. గతంలో ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది కాదు. ఇటీవలే దీనిని అందుబాటులోకి తెచ్చామని కేంద్ర మంత్రి చెప్పారు. రైలు బయలుదేరే ముందు ఐఆర్సిటిసి వెబ్సైట్ను సందర్శించడం ద్వారా లేదా 139కి కాల్ చేయడం ద్వారా టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చని వివరించారు. అయితే టికెట్ రద్దు డబ్బు కౌంటర్లోనే ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.