దేశ వ్యాప్తంగా టిక్టాక్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వారకు దీనికి బానిస అయిన వారు ఉన్నారు. ఇక యువత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది యువత, ప్రత్యేకంగా మహిళలు కూడా టిక్ టాక్ పై చాలా ఆసక్తితో ఉంటారు. ఇంట్లో ఉండే ఆడవారు అయితే చాలా మందే తమలోని ట్యాలెంట్ను టిక్టాక్ ద్వారా ప్రపంచానికి చూపించారు. ఇక ఈ మద్య కాలంలో భారత్-చైనా మధ్య నెలకొన్న రాజకీయ అంతరాలతో సమాచార రక్షణలో టిక్టాక్ ప్రమాదకరంగా మారవచ్చని కేంద్రం టిక్టాక్ను నిషేదించింది. ఇక ఇదే బాటలో అమెరికా కూడా నడవనున్నట్లు సమాచారం. దీంతో ఈ పరిస్థితులను అధిగమించేందుకు టిక్టాక్ యాజమాన్యం సంస్థలోని మెజారిటీ షేర్లను చైనాయేతర దేశ సంస్థలకు అమ్మాలని చూస్తున్నట్లు తెలిసిందే అయితే ఈ క్రమంలో మన దేశానికి చెందిన రిలియన్స్ గ్రూప్ దీన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీంతో టిక్టాక్ ప్రియులకు మళ్ళీ వారి ఫేవరెట్ యాప్ తమకు అందుబాటులోకి వస్తుందని ఆనందపడుతున్నారు. చూడాలి మరి టిక్టాక్ ఎవరి చేతుల్లోకి వెలుతుందో.