‘పుష్ప 2’ నేపథ్య సంగీత విభాగం నుంచి దేవిశ్రీ ప్రసాద్ని తప్పించారు. అతని స్థానంలో తమన్, సామ్ సిఎస్, అజ్నీష్ లోక్నాథ్ పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో ‘పుష్ప 2’ ప్రమోషన్ చెన్నైలో జరిగింది.ఈ ప్రమోషన్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ వేదికపై నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ స్పీచ్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్, దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. అందుకే ‘పుష్ప 2’ మూవీ, అలాగే అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాల నుంచి దేవి శ్రీ ప్రసాద్ని తొలగించారు అని టాక్ నడుస్తుంది.అయిత్ అజిత్ మూవీని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో తమిళ హీరో మరియు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ ని తీసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.