Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు

కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. తాజాగా, రూ.1,700 కోట్లకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పన్ను నోటీసులను సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజా నోటీసు 2017-18 నుంచి 2020-21 సంవత్సరాల అసెస్‌మెంట్‌కు సంబంధించిందని, పెనాల్టీ, వడ్డీ కూడా వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img