భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పెర్త్ టెస్టులో భారత ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 130కి పైగా పరుగులు చేసి చారిత్రక రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో తొలి వికెట్కు అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్లుగా జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు జైస్వాల్ – కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. జైస్వాల్ 123 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 130కి పైగా పరుగులు చేసారు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై జైస్వాల్ – కేఎల్ రాహుల్ తొలి వికెట్ భాగస్వామ్యానికి అత్యధిక పరుగుల రికార్డు సృష్టించారు. 2004లో సిడ్నీలో వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా తొలి వికెట్కు 123 పరుగులు చేసి ఆస్ట్రేలియాలో చివరిసారిగా భారత ఓపెనర్లు ఈ ఘనత సాధించారు.