టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీ ప్లాన్ గడువు ముగిసే వరకు ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19ప్లాన్ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితంచేసింది. రూ.29 ప్లాన్కు గడువును 2రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో కేవలం ఒకగంట వ్యవధిలో రూ.11తో మరో డేటా ప్యాక్ను అందిస్తోంది. ఇప్పటికే కొత్త ప్లాన్లు అమల్లోకి వచ్చాయి.