Jobs : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భూ భారతి చట్టం అమల్లోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, కొత్త గ్రామ పరిపాలనా అధికారి (GPO) పోస్టులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రణాళిక చేస్తుంది. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ మాదిరిగానే జీపీఓ నియామక ప్రక్రియను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ సందర్భంలో గ్రామ పరిపాలనా అధికారి కొత్త పోస్టులను తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 10,954 GPO పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. జీపీవో (GPO) జాబ్ కూడా ప్రకటించబడింది.