ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ యుఐ విద్యార్ధి నాయకుడు సారుగు రాకేష్ జన్మదిన వేడుకలు కేకే యువసేన మండల అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దిటి నరసింహులు, సద్ది మధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ..
విద్యార్థి దశ నుండి మంచి వక్చాతుర్యం తో అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి గా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలని అలవరుచుకుని విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ యువ నాయకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రజా గొంతుక గా మారి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలే, తన సమస్యలు గా భావిస్తూ ముందుకు వెళ్తూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, అందరి మన్నెనలు పొందుతూ రాబోయే తరంలో యువ నాయకుడిగా ఇప్పటికే తన తనదైన ముద్ర వేసుకొని జన నాయకుడుగా సేవలందించి, ముందు ముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దిటి నర్సింలు, అరుట్ల మహేష్, సర్ది మధు, రాజేశం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.