Homeసినిమామ‌ళ్లీ క‌ట్టేందుకు పైస‌ల్లేవ్‌.. ఆ శిథిలాల నుంచే ప‌నిచేస్తానుః కంగ‌నా

మ‌ళ్లీ క‌ట్టేందుకు పైస‌ల్లేవ్‌.. ఆ శిథిలాల నుంచే ప‌నిచేస్తానుః కంగ‌నా

ముంబయి: కూల్చివేసిన త‌న ఆఫీస్‌ భవనాన్ని క‌ట్టుకునేందుకు పైస‌ల్లేవ‌ని, అందుకే ఆ శిథిలాల నుంచే పని చేస్తానని నటి కంగనా రనౌత్ అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన పార్టీపై సోషల్‌ మీడియా వేదికగా విమ‌ర్శ‌లు చేస్తున్న కంగనా తాజాగా KanganaVsUddhav అని పేర్కొంటూ ఓ ట్వీట్ పెట్ట‌డంతోపాటు అందులో త‌న కార్యాల‌య నిర్మాణం, ప్రారంభం గురించి వివ‌రించారు. ‘ఈ ఏడాది జనవరి 15న ముంబయిలో నా కార్యాలయాన్ని ఆరంభించాను. కార్యాలయాన్ని ప్రారంభించిన కొంత కాలానికే కరోనా వైరస్‌ విజృంభించడంతో అందరిలాగానే నేను కూడా వృత్తిపరంగా ఎలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు ఈ ధ్వంసమైన భవనాన్ని తిరిగి చక్కదిద్దడానికి నా దగ్గర పైస‌ల్లేవు. కాబట్టి నేను ఈ శిథిలాల నుంచే పని చేస్తాను. ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలనుకునే ధైర్యవంతురాలైన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ కార్యాలయం ఉంటుంది.’ అని కంగన ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. శివ‌సేన ప్ర‌భుత్వంతో వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కంగ‌నా‌‌ కార్యాలయాన్ని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుధవారం కొంతమేర కూల్చివేసిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img