Homeహైదరాబాద్latest Newsసద్గురు ఆశీస్సులు తీసుకున్న కంగనా.. ఇటు సినిమా.. అటు రాజకీయం.. కంగనా ఏది చేసినా సంచలనమే..!

సద్గురు ఆశీస్సులు తీసుకున్న కంగనా.. ఇటు సినిమా.. అటు రాజకీయం.. కంగనా ఏది చేసినా సంచలనమే..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. కంగనా రనౌత్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో కంగనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి కంగనా గుళ్లకు వెళ్లి ఎన్నో పూజలు చేస్తోంది. అలాగే ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆమె ఆలయాల్లో పూజలు చేస్తారు. కంగనా ఇటీవల సద్గురు ఆశీస్సులు తీసుకున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు వెళ్లారు. అక్కడ ఆమె ఆదియోగిని దర్శించుకుని సద్గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో పింక్ కాటన్ చీరలో సంప్రదాయ లుక్‏లో కంగనా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img