ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్రికెటర్ కపిల్ దేవ్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కపిల్ దేవ్ గారికి ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుగారి తో చర్చించనున్నారు.