Homeహైదరాబాద్latest NewsKarraguttalu : క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 22 మంది మావోయిస్టుల మృతి

Karraguttalu : క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 22 మంది మావోయిస్టుల మృతి

Karraguttalu : ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు 22 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్, “మిషన్ సంకల్ప్”లో భాగంగా.. బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట కొండల సమీపంలో కొనసాగుతోంది. ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో 22 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల మృతిని బస్తర్ ఐజీ, సీఆర్పీఎఫ్ ధ్రువీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వందలాది మావోయిస్టుల స్థావరాలను, బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బీఎస్ఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గత రెండు వారాలుగా కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img