Homeఫ్లాష్ ఫ్లాష్Kavitha: రైతాంగంపై మీకెందుకంత అక్కసంటూ రాహుల్‌కు కవిత సూటిప్రశ్న

Kavitha: రైతాంగంపై మీకెందుకంత అక్కసంటూ రాహుల్‌కు కవిత సూటిప్రశ్న

KAVITHA: తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు. తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నిస్తూ ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ గారు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా ??’’ అని కవిత తన ట్వీట్‌లో ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img